మహేష్ నటించిన "1" పోస్టర్ పై సమంత పెద్ద వివాదమే సృష్టించింది. అయితే మహేష్ ఈ విషయంపై క్షమాపణలు చెప్పడంతో సమంత నోటికి తీరిక దొరికినట్లయింది. కానీ సమంత మాత్రం మళ్ళీ ఎదో ఒక విధంగా వార్తల్లో నిలవడానికి తనవంతు ప్రయత్నాలు తాను చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు చెన్నయ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించింది. "మేకప్ ఉన్నంత వరకు నేను నటిని. ఆ సమయంలో నా ఆలోచన అంతా ఆ పాత్రపైనే ఉంటుంది. మేకప్ తీసేస్తే నేను మాములు సమంతని అయిపోతాను. కొందరిలా నిజజీవితంలో నటించడం నాకు చేతకాదు" అంటూ మాటల తూటాలను విసిరింది. అయితే సమంత చెప్పిన "ఆ కొందరు ఎవరు?" అనే అనుమానం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే తనకు రావలసిన సినిమా ఛాన్స్ లను కొట్టేస్తున్న కాజల్, తమన్నా లను దృష్టిలో ఉంచుకొనే సమంత ఇలా మాట్లాడిందని అందరు అనుకుంటున్నారు. మరి సమంత మాట్లాడిన ఈ మాటలకూ ఎవరు ఎలా స్పందిస్తారో త్వరలోనే తెలియనుంది.